Income Tax Rules: How much money should be kept at home? Shock to know income tax rules - William naik

Mobile Menu

Top Ads

More News

logoblog

Income Tax Rules: How much money should be kept at home? Shock to know income tax rules

24_02

Income Tax Rules: How much money should be kept at home? Shock to know income tax rules

 Income Tax Rules: ఇంట్లో ఎంత డబ్బు ఉంచుకోవాలి? ఆదాయపు పన్ను నియమాలు తెలిస్తే షాక్.

Income Tax Rules: How much money should be kept at home? Shock to know income tax rules  Income Tax Rules: ఇంట్లో ఎంత డబ్బు ఉంచుకోవాలి? ఆదాయపు పన్ను నియమాలు తెలిస్తే షాక్.

ఇటీవల కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ ప్రసాద్ సాహుపై ఆదాయపన్ను శాఖ దాడులు జరిపిన నేపథ్యంలో రూ.351 కోట్ల నగదు ఉన్నట్లు వెల్లడైన విషయం తెలిసిందే. ఈ విషయంపై సాహు తన నిరాశను వ్యక్తం చేస్తూ గత 30-35 సంవత్సరాల నా రాజకీయ జీవితంలో ఇలాంటి సంఘటన జరగడం ఇదే మొదటిసారని, దాని కారణంగా నేను బాధపడ్డాను పేర్కొన్నారు. రికవరీ చేసిన డబ్బు నా సంస్థకు చెందిందని, రికవరీ చేసిన నగదు నా మద్యం సంస్థలకు సంబంధించినది. అది మద్యం అమ్మకం ద్వారా వచ్చిన ఆదాయమని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో హై ప్రొఫైల్ రైడ్ నేపథ్యంలో ఇంట్లో నగదు నిల్వలకు అనుమతించిన పరిమితులు, తాజా ఆదాయపు పన్ను నియమాల గురించి చాలా మంది అనుమానాలు రెకెత్తాయి. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం ఇంట్లో నిల్వ చేసిన డబ్బుపై నిర్దిష్ట పరిమితి లేదు. అయితే ఆదాయపు పన్ను దాడి సమయంలో డబ్బుకు సంబందించిన మూలాన్ని ధ్రువీకరించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో లెక్కించని నిధులు జరిమానాలకు దారితీయవచ్చు. ఆదాయపు పన్ను అధికారులు వివరించని డబ్బును స్వాధీనం చేసుకునే అధికారం కలిగి ఉంటారు. ఈ మొత్తంపై 137శాతం వరకు జరిమానాలు విధించవచ్చు. కాబట్టి ఆదాయపు పన్ను నియమాలు గురించి తెలుసుకుందాం.

రుణాలు లేదా డిపాజిట్ల కోసం నగదు రూపంలో రూ. 20,000 లేదా అంతకంటే ఎక్కువ ఉండకూడదు. రుణాలు లేదా డిపాజిట్ల కోసం ఎవరైనా రూ. 20,000 లేదా అంతకంటే ఎక్కువ నగదును స్వీకరించకుండా ఆదాయపు పన్ను శాఖ నిషేధం విధించింది. 

రూ. 50,000 కంటే ఎక్కువ లావాదేవీలకు పాన్ నంబర్లు తప్పనిసరి అని గుర్తుంచుకోవాలి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సేషన్ ప్రకారం వ్యక్తులు ఒకేసారి రూ. 50,000 కంటే ఎక్కువ డిపాజిట్లు లేదా ఉపసంహరణల కోసం తప్పనిసరిగా పాన్ నంబర్‌లను అందించాలి.

రూ. 30 లక్షలకు పైబడిన నగదు ఆధారిత ఆస్తుల లావాదేవీల పరిశీలిస్తుంది. రూ. 30 లక్షలకు మించిన నగదు ద్వారా ఆస్తుల కొనుగోలు లేదా అమ్మకంలో నిమగ్నమైన భారతీయ పౌరులు దర్యాప్తు ఏజెన్సీల పరిశీలనలోకి రావచ్చు. 

రూ. 1 లక్ష కంటే ఎక్కువ క్రెడిట్-డెబిట్ కార్డ్ లావాదేవీలపై పరిశోధన చేయాలి. క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్‌ల ద్వారా ఒకేసారి లక్ష రూపాయల కంటే ఎక్కువ చెల్లింపు పరిశోధనలను ప్రారంభించవచ్చు.

ఒక సంవత్సరంలో బ్యాంకు నుంచి రూ. 1 కోటి కంటే ఎక్కువ నగదును విత్‌డ్రా చేసే వ్యక్తులు 2 శాతం టీడీఎస్ చెల్లించాల్సి ఉంటుంది.

ఒక సంవత్సరంలో 20 లక్షలకు మించిన నగదు లావాదేవీలు జరిమానాలు విధించవచ్చు. అయితే 30 లక్షలకు పైగా నగదు ఆస్తిని కొనుగోలు చేయడం, విక్రయించడం పరిశోధనలను ప్రాంప్ట్ చేయవచ్చు.

పాన్, ఆధార్ వివరాలు లేని కొనుగోళ్లకు 2 లక్షల కంటే ఎక్కువ నగదు చెల్లించకూడదు. క్రెడిట్-డెబిట్ కార్డ్‌లతో రూ. 1 లక్ష కంటే ఎక్కువ లావాదేవీలపై పరిమితులు ఉన్నాయి.

ఒక రోజులో బంధువు నుంచి రూ. 2 లక్షల కంటే ఎక్కువ నగదు పొందడం లేదా వేరొకరి నుండి నగదు రూపంలో రూ. 20,000 కంటే ఎక్కువ రుణం తీసుకోవడం నిషేధించారు. 

ఈ నియమాలను అర్థం చేసుకోవడం ద్వారా చట్టపరమైన పరిణామాలను నివారించడంతో పాటు ఆదాయపు పన్ను నిబంధనలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం.