Chittoor firing incident. - William naik

Mobile Menu

Top Ads

More News

logoblog

Chittoor firing incident.

25_03

Chittoor in a state of shock.. a twist in the firing incident.

Chittoor: ఉలిక్కిపడిన చిత్తూరు.. కాల్పుల ఘటనలో దిమ్మతిరిగే ట్విస్ట్.. పెద్ద కథే..

Chittoor firing incident.

అది.. చిత్తూరు జిల్లా కేంద్రంలోని గాంధీ రోడ్.. ఉదయం 6:30 గంటలకే పోలీసుల హడావుడి. పెద్ద సంఖ్యలో గుమికూడిన జనం. పుష్ప కిడ్స్ వరల్డ్ షాప్ లోకి ఆరుగురు దుండగులు చొరబడ్డారన్న సమాచారంతో పోలీసులు అలర్టయ్యారు.. దుండగుల దాడిలో గాయపడి తప్పించుకున్న యజమాని చంద్రశేఖర్ దుండగులు వద్ద తుపాకులు ఉన్నట్లు చెప్పడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది.

అది.. చిత్తూరు జిల్లా కేంద్రంలోని గాంధీ రోడ్.. ఉదయం 6:30 గంటలకే పోలీసుల హడావుడి. పెద్ద సంఖ్యలో గుమికూడిన జనం. పుష్ప కిడ్స్ వరల్డ్ షాప్ లోకి ఆరుగురు దుండగులు చొరబడ్డారన్న సమాచారంతో పోలీసులు అలర్టయ్యారు.. దుండగుల దాడిలో గాయపడి తప్పించుకున్న యజమాని చంద్రశేఖర్ దుండగులు వద్ద తుపాకులు ఉన్నట్లు చెప్పడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది.. చిత్తూరు ఎస్పీకి సమాచారం ఇచ్చిన టూ టౌన్ పోలీసులు స్థానికుల సహాయంతో ఆపరేషన్ ప్రారంభించారు. షాప్ లోకి వెళ్లేందుకు పోలీసులు ప్రయత్నం చేసారు.. క్షణం క్షణం ఉత్కంఠ.. మూడు గంటలకుపైగా శ్రమించారు. అప్పటికే స్థానికుల సహాయంతో పోలీసులు ముగ్గురు దుండగులను అదుపులో తీసుకున్నారు.. అయితే.. పోలీసులు హడావిడిని చూసి భయంతో భవనం పైనుంచి దూకి మరో దుండగుడు ఆసుపత్రి పాలు అయ్యాడు. అయితే.. పుష్ప కిడ్స్ వరల్డ్ షాప్ లోకి చొరబడ్డ ఆరుగురు దుండగుల్లో ఇద్దరు లోపలే ఉన్నట్టు గుర్తించిన పోలీసులు.. వారి దగ్గర తుపాకులు ఉన్నట్లు చెప్పడంతో లోపలికి వెళ్ళే సాహసం చేయలేక పోయారు. దుండగులను ప్రతిఘటించి బయటకు వచ్చిన యజమాని చంద్రశేఖర్ నుంచి వివరాలు సేకరించిన ఎస్పీ మణికంఠ చందోలు స్వయంగా ఆపరేషన్ ను పర్యవేక్షించారు.

దుండగుల నుంచి డమ్మీ తుపాకులు, కత్తులు స్వాధీనం..

తమిళనాడు రిజిస్ట్రేషన్ ఉన్న మినీ వ్యాన్ లో వచ్చిన ఆరుగురు దుండగులు.. ఐడీబీఐ ముందే మినీ వ్యాన్ ను పార్క్ చేసి లోపైకి దర్జాగా వెళ్ళారు. పుష్ప కిడ్స్ వరల్డ్ షాప్ పక్కనే ఐడిబిఐ బ్యాంకు ఉండటంతో దుండగులు టార్గెట్ ఏంటన్న దానిపై పోలీసులు పలు కోణాల్లో ఆలోచించారు. దుండగులు ప్రయాణించిన వ్యాన్ లో ఉన్న మారణాయుధాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు, షాపు లోనే ఉండిపోయిన ఇద్దరు వ్యక్తుల కోసం ఆపరేషన్ కొనసాగించారు. ఆక్టోపస్ బలగాలను కూడా రంగంలోకి దింపారు. పుష్ప కిడ్స్ వరల్డ్ షాపులోకి చొరబడ్డ దుండగు ల్లో పట్టుబడ్డ ముగ్గుర్ని విచారించిన ఎస్పీ మణికంఠ చందోలు.. షాపు యజమాని చంద్రశేఖర్ నుంచి కూడా వివరాలు సేకరించారు.. ఎట్టకేలకు దోపిడీకే దుండగులు వచ్చినట్లు భావించిన పోలీసులు.. ఆపరేషన్ ప్రారంభించి చంద్రశేఖర్ కు చెందిన మూడు అంతస్తుల భవనంలో ఉండిపోయిన ఇద్దర్ని పట్టుకున్నారు.

అయితే.. హిందీ – తెలుగు మాట్లాడుతున్న దుండగుల నుంచి ఎట్టకేలకు క్లూ కనిపెట్టిన ఎస్పీ.. ఈ ప్లాన్ కు చిత్తూరులోని ఒక ఫర్నిచర్ షాప్ కు చెందిన వ్యక్తి కీలకమని గుర్తించారు. చంద్రశేఖర్ బిల్డింగ్ కు ఫర్నిచర్ చేసిన ఆ వ్యక్తే దుండగులతో దోపిడీకి ప్రయత్నించినట్లు అనుమానించారు. ఎట్టకేలకు ఎస్ఎల్వీ ఫర్నిచర్ షాప్ నిర్వహిస్తున్న సుబ్రహ్మణ్యం కోసం ఆరా తీసిన పోలీసులు.. చిత్తూరు చోరీ కేసును చేధించారు. ఇలా ఉదయం 6:30 గంటల నుంచి దాదాపు నాలుగు గంటల పాటు శ్రమించి ఆపరేషన్ ను పూర్తి చేశారు.

పోలీసుల విచారణలో డమ్మీ గన్నులతో షాప్ యజమానిని బెదిరించిన దొంగల అసలు కథ బయటపడింది.. ఫర్నిచర్ షాప్ వ్యక్తితో పాటు కేసులో ఏడుగురికి సంబంధం ఉన్నట్లు తేల్చారు. దుండగుల్లో ముగ్గురు అనంతపురం జిల్లా ఎరుకుల రామాపురం చెందినవారు కాగా.. మరో ముగ్గురు నంద్యాలకు చెందిన వారుగా గుర్తించారు. చిత్తూరులో ఎస్ ఎల్ వీ ఫర్నిచర్ షాపు ను నిర్వహిస్తున్న సుబ్రహ్మణ్యంతోపాటు మరో నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు తప్పించుకున్న ఇద్దరు కోసం గాలిస్తున్నారు.

అన్ని కోణాల్లో దర్యాప్తు..

చిత్తూరులో షాప్ లోకి మారణాయుధాలతో చొరబడ్డ దుండగుల కేసును పోలీసు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. దొంగతనం కోసం దొంగలు చంద్రశేఖర్ ఇంటిలోకి వెళ్లడం.. వారి దగ్గర గన్స్ ఉన్నాయనే కారణంతో పోలీసులు ఇంటిని చుట్టుముట్టామన్నారు. దొంగలు పారిపోవడానికి ప్రయత్నం చేశారని.. ఈ క్రమంలోనే వారిని అదుపులోకి తీసుకుని అన్ని కోణాల్లో విచారించామన్నారు. దొంగతనం కోసం మాత్రమే వచ్చినట్లు గుర్తించామంటున్న పోలీసులు.. ఉగ్రవాదులని, ఇతర రాష్ట్రల ముఠాలన్న ప్రచారం వాస్తవం కాదని స్పష్టం చేశారు. పూర్తిస్థాయి విచారణ తర్వాత వివరాలు వెల్లడిస్తామని.. చెప్పారు. రెండు డమ్మీ గన్స్ తో పాటు ఆరుగురిని అదుపులో తీసుకున్నామని  వివరించారు చిత్తూరు 2 టౌన్ సిఐ నెట్టికంటయ్య..

ఫర్నిచర్ షాపు యజమానే కుట్రలో కీలకం..

పుష్ప కిడ్స్ షాపు యజమాని చంద్రశేఖర్ ను ఏస్ఎల్వీ ఫర్నిచర్ కు చెందిన సుబ్రమణ్యం ఎందుకు టార్గెట్ చేశారన్నదే పోలీసుల ఇంటరాగేషన్ లో కీలకంగా మారింది. ఇద్దరి మధ్య ఉన్న లావాదేవీలపై ఆరా తీసిన పోలీసులు కర్నూలు జిల్లాకు చెందిన సుబ్రమణ్యం చరిత్రపై దృష్టి పెట్టారు. అప్పులు, ఆర్థిక ఇబ్బందులతోనే డబ్బున్న పుష్ప కిడ్స్ ఓనర్ చంద్రశేఖర్ ను టార్గెట్ చేసి ఉంటారని భావిస్తున్నారు.

కాగా.. దుండగుల వద్ద తుపాకులున్నాయన్న సమాచారంతో ఏపీ ప్రభుత్వం కూడా అప్రమత్తం అయింది.. వెంటనే ఆక్టోపస్ బలగాలను రంగంలోకి దింపింది.. ఈ క్రమంలోనే.. చిత్తూరు పోలీసులు ఆపరేషన్ ను పూర్తిచేశారు.